నిరసన గళం
ABN , First Publish Date - 2020-03-18T11:08:18+05:30 IST
మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ అడ్డరోడ్డులో రైతులు, మహిళలు వ్యక్తం చేస్తున్న నిరసనలు మంగళవారం నాటికి 73వ రోజుకు
రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
గుంటూరు, తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ, మార్చి 17: మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ అడ్డరోడ్డులో రైతులు, మహిళలు వ్యక్తం చేస్తున్న నిరసనలు మంగళవారం నాటికి 73వ రోజుకు చేరుకున్నాయి. మంగళగిరి మండలం యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు మంగళవారం నాటికి 91వ రోజుకు చేరాయి. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లిలో దీక్షలను కొనసాగించారు.