ప్రైవేట్ ఆస్పత్రిలో బొండా, బుద్దాలకు చికిత్స
ABN , First Publish Date - 2020-03-12T10:03:15+05:30 IST
గుంటూరు జిల్లా మాచెర్లలో వైసీపీ వర్గాలు చేసిన దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు బుధవారం రాత్రి విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్లో చికిత్స పొందారు.
విజయవాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు జిల్లా మాచెర్లలో వైసీపీ వర్గాలు చేసిన దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు బుధవారం రాత్రి విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్లో చికిత్స పొందారు. నాయకుల గాయాలకు వైద్యులు, సిబ్బంది వైద్యం చేసి కట్లు కట్టారు. అనంతరం వారు ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు.