శ్రీశైలం బస్సులు బంద్
ABN , First Publish Date - 2020-07-15T10:01:56+05:30 IST
జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి వెళ్లే ఆర్టీసీ బస్సులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు .
బళ్లారికి నేటి నుంచి బస్సులు
కర్నూలు, జూలై 14(ఆంధ్రజోతి):జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి వెళ్లే ఆర్టీసీ బస్సులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు రీజినల్ మేనేజర్ టి.వెంకటరామం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా శ్రీశైలాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారని, ఈ కారణంగా 21 వరకు బస్సులను నిలిపివేశామని తెలిపారు. ఈ నెల 7 నుంచి ఆగిన బళ్ళారి సర్వీసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.