బ్యాంకులు..10 నుంచి 2 వరకే...
ABN , First Publish Date - 2020-04-18T10:11:40+05:30 IST
కరోనా ప్రభావంతో బ్యాంకుల పనివేళలు మారాయి. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4
నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్ 17 : కరోనా ప్రభావంతో బ్యాంకుల పనివేళలు మారాయి. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేసేవి. అయితే కరోనా విజృంభణ, భౌతిక దూరం పాటించకుండా జనం ఎగబడుతుండటంతో పనివేళలను కుదించారు. ఇక నుంచి ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయి. అదేవిధంగా ఇప్పటివరకు రూ.లక్షకు పైబడితేనే నగదు డిపాజిట్ చేయాలనే నిబంధన ఉండేది. దానిని శుక్రవారం నుంచి తొలగించారు. ఎంతైనా డిపాజిట్, విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. మే 3వ తేదీ వరకు ఇవే పని వేళలు కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.