కొత్తగా 1,270 కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-09-05T07:40:37+05:30 IST
జిల్లాలో కరోనా ఉధతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వెయ్యికిపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
నెల్లూరు (వైద్యం) : జిల్లాలో కరోనా ఉధతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వెయ్యికిపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1,270 కేసులు నమోదవగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37,099లకు చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకోలేక ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరులో ముగ్గురు, నెల్లూరు రూరల్ మండలంలో ఒకరు, బాలాయపల్లిలో 1, గూడూరులో 2, కావలిలో 1 మృతి చెందారు. కరోనాతో కోలుకున్న 1138 మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు.