మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ విఫలం
ABN , First Publish Date - 2020-12-25T05:35:34+05:30 IST
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నా రు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
దళిత యువతి హత్యను నిరసిస్తూ
టీడీపీ శ్రేణుల కాగడాల ప్రదర్శన
కనిగిరి, డిసెంబరు 24 : వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నా రు. అనంతపురం జిల్లాలో దళిత యువతి హత్యను నిరసిస్తూ పట్టణంలో ఉగ్ర ఆధ్వ ర్యంలో టీడీపీ శ్రేణులు గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అనంత రం స్థానిక పామూరు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భం గా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ అనంతపురం జిల్లా ధర్మవరంలో దుర్గార్గుల చేతుల్లో దళిత యువతి బలైపోవడం ఎంతో దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే మహిళల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. మహిళలపై వరుస అఘా యిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎం దుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. పోలీ సులు సకాలంలో స్పందించకపోవడంతోనే రాష్ట్రంలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నా రని అన్నారు. వేధింపులపై యువతి తల్లిదం డ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవ డం వలనే ఈ అఘాయిత్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువతిని అతి కిరాతకంగా హతమార్చిన నిందితులను ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని, లే దంటే ఇలాగే ఈ ప్రభుత్వం కూడా దమన కాండకు గురవుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని డాక్టర్ ఉగ్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు యాదవ్, బేరి పు ల్లారెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, వివిఆర్ మనోహర్రావు, తమ్మినేని వెంకటరెడ్డి, రాచ మల్ల శ్రీనివాసులరెడ్డి, జక్రయ్య, గండి కోట రమేష్, మధు, రిజ్వాన్, తమ్మినేని శ్రీని వాసు లరెడ్డి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పా ల్గొన్నారు.