కరోనా అలెర్ట్!
ABN , First Publish Date - 2020-03-19T10:02:32+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) ప్రభావం తీవ్రంగా కనిపిస్తుండగా జిల్లా లోనూ వివిధ స్థాయిల్లో అప్రమత్తమవుతున్నారు. ప్రధానంగా
బోసిపోయిన రైల్వే స్టేషన్లు
మూతపడిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రం సాలిహుండాం
నేటి నుంచి ఎస్వీసీ థియేటర్లు బంద్
అదేబాటలో మరికొన్ని యాజమాన్యాలు
నేటి నుంచి అరసవిల్లిలో ఆర్జిత సేవలు రద్దు
శ్రీకాకుళం, మార్చి 18 : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) ప్రభావం తీవ్రంగా కనిపిస్తుండగా జిల్లా లోనూ వివిధ స్థాయిల్లో అప్రమత్తమవుతున్నారు. ప్రధానంగా జనసమ్మర్థం ఉండే సినిమా థియేటర్లు మూసివేసే దిశగా సంబంధిత యాజమాన్యాలు చర్యలు తీసు కుంటుండగా ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం సాలిహుండాంలో పర్యాటకులను అనుమతించడం లేదు. దీనికి సంబంధించి అధికారుల ఆదేశాలతో ఈ పర్యాటక క్షేత్రాన్ని తాత్కా లికంగా మూసివేస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. జిల్లాలో పెద్ద రైల్వే స్టేషన్లు శ్రీకా కుళం రోడ్, పలాస కరోనా ఎఫెక్ట్తో బుధవారం బోసిపోయాయి.
నిత్యం కళకళ లాడే స్టేషన్లలో కనీస స్థాయిలోనూ ప్రయా ణికులు లేకపోవడంతో ఖాళీగా కని పించా యి. ఇదిలా ఉండగా కరోనా ఎఫెక్ట్ వల్ల వచ్చే ప్రయాణికులను తగ్గించే దిశలో ప్లాట్ ఫారం టిక్కెట్ను రూ.50లకు పెంచి రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకూర్మం కూర్మనాథాలయంలో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు క్లోరినేషన్ చేపడుతున్నారు. అరసవిల్లి ఆదిత్యుని ఆలయంలో ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనాలు రద్దుచేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...