నిత్యాన్నదానానికి లక్ష విరాళం
ABN , First Publish Date - 2020-03-15T10:46:07+05:30 IST
అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి నరసన్నపేటకు చెందిన టి.శ్రీవెంకటేశ్వర్లు, కనకరత్నం దంపతులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆలయ
అరసవిల్లి, మార్చి 14: అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి నరసన్నపేటకు చెందిన టి.శ్రీవెంకటేశ్వర్లు, కనకరత్నం దంపతులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ను వారు శనివారం కలుసుకుని, ఈ నగదును అందజేశారు. ఈసందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ప్రతిరోజూ సూర్యదేవాలయంలో 400 నుంచి 600 మందికి, ఆదివారం వెయ్యి నుంచి 1,300 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు. అనంతరం దాతలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఈవో అందజేశారు.