నగరం.. జనసంద్రం
ABN , First Publish Date - 2020-03-04T11:01:07+05:30 IST
పట్టణంలోని మహారాజ సంగీత కళాశాల కూడలిలో ఉన్న ఎల్లమాంబ జాతర వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం
రింగురోడ్డు : పట్టణంలోని మహారాజ సంగీత కళాశాల కూడలిలో ఉన్న ఎల్లమాంబ జాతర వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తజనసంద్రమైంది. సాయంత్రం డప్పు వాయిద్యాలు, భక్తుల శరణగోష నడుమ సిరిమాను ఊరేగించారు. అమ్మవారి ప్రధాన అర్చకులు అగ్రపు కృష్ణారావు, చందక అప్పారావు ఆధ్వర్యంలో సిరిమాను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసింది.