నిజాయితీ అధికారులకు బదిలీ
ABN , First Publish Date - 2020-03-04T11:00:11+05:30 IST
జిల్లాలో నిజాయితీగా రాజకీయ పార్టీ లను పట్టించుకోకుండా పని చేయాల నుకునే అధికారులకు బదిలీ తప్పడం
దాసన్నపేట, మార్చి 3: జిల్లాలో నిజాయితీగా రాజకీయ పార్టీ లను పట్టించుకోకుండా పని చేయాల నుకునే అధికారులకు బదిలీ తప్పడం లేదని లోక్సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ వాపోయారు. మంగళవారం విజయనగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో నిజాయితీగా పనిచేసే ఏసీబీ డీఎస్పీ నాగేశ్వ రరావు, డీపీఓ సత్యనారాయణ, ఖజానా శాఖ డీడీ వనజారాణి, ఫౌర సరఫరాల శాఖ డీఎం షర్మిలా వంటి వారిని అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారో తెలియదని వాపోయారు.
ఖజానా శాఖ డీడీ వనజారాణి జిల్లాలో పనిచేసిన తక్కువ సమ యంలోనే ఆ శాఖలో జరిగిన అవినీతిపై కన్నెర చేసి, ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో రూ.4 కోట్లు అవినీతిని బయట పెట్టారన్నారు. అన్ని స్థాయిల్లో అవినీతికి పాల్పడేవారని, ప్రజాప్రతినిధులు పేర్లు చెప్పి చలా మణి అయ్యేవారిని కట్టడి చేశారన్నారు. అటువంటి అధికారిని బదిలీ చేయడం సరికాదన్నారు. చాలామంది అధికారులు జిల్లాలో పనిచేయలేక భయపడిపోతు న్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు నాగ భూషణం, రాజారావు, ఆదిబాబు, అప్పారావు, పీఎల్ ఎన్ రాజు, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు.