బ్యాంకు పనివేళల్లో మార్పు
ABN , First Publish Date - 2020-04-18T10:07:31+05:30 IST
బ్యాంకు పనివేళల్లో మార్పు లు చేశారు. గతంలో మాదిరిగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల
ఏలూరు సిటీ, ఏప్రిల్ 17: బ్యాంకు పనివేళల్లో మార్పు లు చేశారు. గతంలో మాదిరిగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాంకులు పనిచే స్తాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు ఎ.రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ బ్యాంకు పనివేళలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో 39 బ్యాంకులకు సంబం ధించి 635 బ్యాంకు బ్రాంచిలున్నాయి. వీటన్నింటిలో బ్యాంకు కార్యకలాపాలు కొత్తగా ప్రకటించిన పనివేళలు ప్రకారం జరుగుతాయి. ఏటీఎంలు ఎప్పటిలాగే యధా విధిగా పనిచేస్తాయి.