చంద్రబాబు విమర్శలు తగవు : కొట్టు
ABN , First Publish Date - 2020-05-10T09:01:55+05:30 IST
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ యజమాన్యంపై ప్రభుత్వం వేసిన ఐఏఎస్ల కమిటీకి ఏం తెలుసని..
తాడేపల్లిగూడెం రూరల్, మే 9 : విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ యజమాన్యంపై ప్రభుత్వం వేసిన ఐఏఎస్ల కమిటీకి ఏం తెలుసని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం ఆయన మతిలేనితనానికి నిదర్శనమని ఎమ్మెల్యే కొట్టు సత్య నారాయణ విమర్శించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం చనిపోయిన ఒక్కొక్కరికీ రూ.కోటి నష్టపరిహారం ప్రకటిస్తే దాన్ని అభినందించడం మానేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కరరావు, రఘురాం నాయుడు, కొట్టు విశాల్, గుండుబోగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.