మరోసారి బెంగాల్కు కేంద్ర బృందాలు
ABN , First Publish Date - 2020-06-04T16:52:06+05:30 IST
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ అంజు శర్మ సారథ్యంలో ఏడుగురు అధికారులతో కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని నియమించింది.
కోల్కతా : కేంద్ర బృందాలు మరోసారి బెంగాల్లో పర్యటించనున్నాయి. అయితే ఈసారి కోవిడ్ పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కాదు... ఆంఫన్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించడానికి ఈ బృందం వెళ్లనుంది. వీరందర్నీ ‘రాష్ట్ర అతిథులుగా’ మమత సర్కార్ అభివర్ణించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ అంజు శర్మ సారథ్యంలో ఏడుగురు అధికారులతో కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని నియమించింది.
రోడ్లు భవనాలు, జలశక్తి, విద్యుత్ శాఖ, మత్స్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. రెండ్రోజుల పాటు బెంగాల్లో ఈ బృందం పర్యటిస్తుండగా... వీరి పర్యటన గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఆంఫన్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రధాని మోదీ బెంగాల్లో పర్యటించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల సాయాన్ని కూడా ప్రకటించారు. బెంగాల్కు తక్షణ సహాయంగా వెయ్యి కోట్లను కూడా మోదీ ప్రకటించారు.