‘విమానాశ్రయాలు, ఓడరేవుల దగ్గర వైద్య పరీక్షలు’
ABN , First Publish Date - 2020-03-02T21:46:59+05:30 IST
‘విమానాశ్రయాలు, ఓడరేవుల దగ్గర వైద్య పరీక్షలు’
ఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రమంత్రి హర్షవర్థన్ తెలిపారు. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేకదృష్టి సారించామన్నారు. 12 దేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల దగ్గర వైద్య పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. 15 ల్యాబ్లలో కరోనా వైరస్ నమూనాలను పరీక్షిస్తున్నామన్నారు.