జీతం అందలేదని కరోనా వారియర్స్ ఆందోళన
ABN , First Publish Date - 2020-04-18T13:38:13+05:30 IST
ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. కరోనా వారియర్స్ ను ప్రోత్సహిస్తోంది. అయితే యూపీలోని లక్నోలో కరోనా వారియర్స్ జీతం ఇవ్వని కారణంగా విధులు బహిష్కరించారు.. ఈ ఉదంతం లక్నోలోని...
లక్నో: ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. కరోనా వారియర్స్ ను ప్రోత్సహిస్తోంది. అయితే యూపీలోని లక్నోలో కరోనా వారియర్స్ జీతం ఇవ్వని కారణంగా విధులు బహిష్కరించారు.. ఈ ఉదంతం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) లో చోటుచేసుకుంది. కేజీఎంయూకు చెందిన శతాబ్ది బ్లాక్లోని సఫాయి కార్మికులు జీతంలో కోత వేశారని ఆరోపణలు చేస్తూ పనులు బహిష్కరించారు. ఆసుపత్రి క్లీనింగ్ సిబ్బంది గత ఏడాది డిసెంబర్ వరకు నెలకు 8 వేల రూపాయల చొప్పున జీతం పొందేవారు. గత మూడు నెలలుగా వారికి జీతం అందడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరు ఆందోళనకు దిగారు. కాగా కేజీఎంయూ శాతాబ్ది బ్లాక్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించే సంస్థ పర్యవేక్షకుడు విజయ్ శంకర్ అవస్థీ మాట్లాడుతూ 66 మంది ఉద్యోగుల్లో 18 మందికి జనవరి జీతం అందలేదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.