పోటీ పరీక్షల దరఖాస్తు తేదీలను పొడిగించండి: కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2020-03-30T23:44:30+05:30 IST
కరోనా నేపథ్యంలో అన్ని రకాల పోటీ పరీక్షల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ఆఖరు తేదీలను పొడిగించాలని...
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అన్ని రకాల పోటీ పరీక్షల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ఆఖరు తేదీలను పొడిగించాలని కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కోరారు. ఈ మేరకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్కు ఆయన పలు సూచనలందించారు. జేఎన్యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్ పరీక్ష, యూజీసీ, ఎన్ఈటీ, సీఎస్ఐఆర్ ఎన్ఈటీ వంటి పరీక్షలన్నింటినీ కనీసం ఒక నెల పాటు వాయిదా వేయాలని నిశాంక్ ఎన్టీఏను కోరారు.