వలస కార్మికుల పిల్లల చదువు ఆగొద్దు
ABN , First Publish Date - 2020-07-15T07:02:46+05:30 IST
లాక్డౌన్ వల్ల స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన ఆదేశాలిచ్చింది. స్వగ్రామాల్లోని వారి పరిసర పాఠశాలల్లో ప్రవేశానికి తప్పనిసరి రుజువులు మినహా ఇతరత్రా పత్రాలు కోరవద్దని...
- టీసీ, గత తరగతుల రుజువు అడగొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 14: లాక్డౌన్ వల్ల స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన ఆదేశాలిచ్చింది. స్వగ్రామాల్లోని వారి పరిసర పాఠశాలల్లో ప్రవేశానికి తప్పనిసరి రుజువులు మినహా ఇతరత్రా పత్రాలు కోరవద్దని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. టీసీ, గతంలో చదివిన తరగతుల రుజువులు వంటివి అడగకుండా.. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం సరైనదేనని భావించి సంబంధిత తరగతిలో చేర్చుకోవాలని నిర్దేశించింది.