ఆర్థిక సమానత్వమే.. సామాజిక సమానత్వానికి పునాది
ABN , First Publish Date - 2020-07-19T07:36:39+05:30 IST
ఆర్థిక సమానత్వమే సామాజిక సమానత్వానికి పునాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. షెడ్యూల్డు కులాల(ఎస్సీ)ల సంక్షేమం కోసం ’నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన’ పథకాన్ని శనివారం ఆయన ప్రాంభించారు...
- ఎస్సీలకు సంక్షేమ పథకాన్ని ప్రారంభించిన యూపీ సీఎం
లక్నో, జూలై 18: ఆర్థిక సమానత్వమే సామాజిక సమానత్వానికి పునాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. షెడ్యూల్డు కులాల(ఎస్సీ)ల సంక్షేమం కోసం ’నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన’ పథకాన్ని శనివారం ఆయన ప్రాంభించారు. ఈ పథకం ద్వారా ఉత్తరప్రదేశ్లోని చిరు వ్యాపారం, లాండ్రీ, డ్రైక్లీనింగ్, సైబర్కేఫ్, టెంట్హౌ్సల ఏర్పాటుకు ఎస్సీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు.