స్వార్థ ప్రయోజనాల కోసమే ఎమర్జెన్సీ
ABN , First Publish Date - 2020-06-26T10:40:50+05:30 IST
స్వార్థ ప్రయోజనాల కోసమే 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల్
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల్ ప్రదీప్
మంచిర్యాల అర్బన్, జూన్ 25: స్వార్థ ప్రయోజనాల కోసమే 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల్ ప్రదీప్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అధ్యక్షతన గురువారం ఎమర్జెన్సీ బ్లాక్డేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమర్జెన్సీ విధించి ఇందిరా గాంధీ దేశ ప్రజలను నిర్బంఽధానికి గురిచేసిందని విమర్శించారు. ఎమర్జెన్సీ వల్ల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేటి తరానికి తెలియాల్సి ఉందన్నారు. ఎమర్జెన్సీ విధించినపుడు విద్యార్థులు వ్యతిరేకంగా పోరాటం చేశారని, అందులో బీజేపీ నాయకులు భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. బీజేపీ పట్టణ ప్రధాన కార్య దర్శి బోయిని హరికృష్ణ, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, గోపతి మల్లేష్, పానుగంటి మధు, తులా మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.