గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీదే విజయం : కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2020-11-06T10:08:18+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీదే విజయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు
బర్కత్పుర, నవంబర్ 5 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీదే విజయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గ్రేటర్వాసులు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని, వారంతా బీజేపీవైపు చూస్తున్నారని ఆయన అన్నారు. గురువారం బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో బీజేపీ అంబర్పేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కన్వీనర్ అజయ్కుమార్ నేతృత్వంలో జరిగింది. దీనికి కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రేటర్లో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన కోరారు.
పొదుపు గ్రూపు సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.10నుంచి 20 లక్షల వరకు రుణాలు అందిస్తోందన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో బర్కత్పుర- అంబర్పేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్రావు, నగర మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నగర ఉపాధ్యక్షుడు కన్నె రమే్షయాదవ్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎక్కాల నందు, మాజీ కార్పొరేటర్లు నేమూరి సాంబశివగౌడ్, వనం రమేష్, నాయకులు శ్రీనివా్సముదిరాజ్, బండారు సంతో్షకుమార్, చుక్కాజగన్, నాగభూషణంచారి, శ్యామ్రాజ్ పాల్గొన్నారు.
వచ్చే మూడునెలలు అప్రమత్తంగా ఉండాలి
గోల్నాక: చలికాలంతోపాటు పండుగల సీజన్ కావడంతో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, వచ్చే మూడు నెల లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించారు. గురు వారం ఆయన గోల్నాక డివిజన్లోని తిరుమలనగర్కు చెందిన వెంకటరాంరెడ్డికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.45వేల చెక్కును లబ్ధిదారుకు అందజేసి మా ట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ బర్కత్పుర, అంబర్పేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్రావు, నర్సింగ్రావుయాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.