బ్రిటన్ నుంచి హుస్నాబాద్కు వచ్చిన మహిళకు పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-26T05:23:14+05:30 IST
బ్రిటన్ నుంచి హుస్నాబాద్కు వచ్చిన మహిళకు పాజిటివ్
సిద్దిపేట: జిల్లాలో శుక్రవారం 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేటలో 8, మిరుదొడ్డిలో 1, గజ్వేల్ ఆస్పత్రి లో 1, అక్కన్నపేటలో 1, బెజ్జంకిలో 3, కోహెడలో 1 కేసు వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళ హుస్నాబాద్కు వచ్చిందని తెలియడంతో ఆమె కుటుంబంలోని ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు విమానాశ్రయంలో పరీక్ష చేసినపుడు నెగటివ్గా తేలింది. గురువారం సిద్దిపేటలో మరోసారి మహిళను పరీక్షించగా పాజిటివ్ రాగా ఆమె కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్గా తేలినట్లు వైద్యాధికారులు తెలిపారు.