సూర్యాపేట జిల్లాకు ఆధ్యాత్మిక శోభ
ABN , First Publish Date - 2020-12-26T04:33:44+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండుగలు ఒకే రోజు రావడంతో అటు ఆలయాలు, ఇటు ప్రార్థనామందిరాలు భక్తులతో నిండిపోయాయి.
సూర్యాపేట, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండుగలు ఒకే రోజు రావడంతో అటు ఆలయాలు, ఇటు ప్రార్థనామందిరాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్థరాతి దాటాక (తెల్లవారితే శుక్రవారం) చర్చిల్లో ప్రార్థనలతో క్రిస్మస్ సంబరాలు మొదలవగా, తెల్లవారుజామున విష్ణురూపుడి ఉత్తరదర్శనం కోసం ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.