మట్టి రోడ్లకు మహర్దశ
ABN , First Publish Date - 2020-03-02T12:57:20+05:30 IST
జిల్లాలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ పథ కం ద్వారా భారీగా నిధులు మంజూరు చేసింది. దీం తో మట్టి రోడ్లకు మహర్దశ
- సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15.60 కోట్లు మంజూరు
- 31 లోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు
కామారెడ్డి: జిల్లాలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ పథ కం ద్వారా భారీగా నిధులు మంజూరు చేసింది. దీం తో మట్టి రోడ్లకు మహర్దశ కల్గనుంది. వీటి నిర్మాణాల ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాకు రూ.15.60 కోట్లు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 60:40 శాతం నిష్పత్తిలో గ్రామాల్లో ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్ల పను లు చేపట్టనున్నారు. 60 శాతం కూలీలతో చేయించను ండగా 40 శాతం మెటిరియల్ కంపోడెంట్ కింద పనులు నిర్వహిస్తారు. దీంతో గుంతలు పడి, వర్షాకాలంలో బురదమయంగా ఉండే మట్టి రోడ్లకు సీసీ వేయనున్నారు. జిల్లా లోని 22 మండలాల్లో 394 సీసీరోడ్ల నిర్మాణం చేసేం దు కు రూ.15.60 కోట్లు మం జూరయ్యాయి.
గడువుకు గండం
సీసీ రోడ్ల నిర్మాణాలకు ఈ నెల 31 వరకు మాత్ర మే గడువు విధించడంతో కాంట్రాక్టర్లను ఆందోళనకు గురి చేస్తుంది. నెల రోజు లు మాత్రమే గడువు ఉండడంతో అన్నిచోట్ల పనులు ఒకే సారి మొదలయితే మెటీరియల్ కొరతతో పాటు కూలీల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయించడం, పనులన్ని ఒకేసారి కొనసాగితే అధికారుల పర్యవేక్షణ కూడా కొంత ఇబ్బం దిగానే ఉంటుందన్నారు. పలువురు చర్చించుకుం టున్నారన్నారు. గడువు గండంతో ప నులు చేసేం దుకు కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చేందుకు జంకుతున్నారన్నారు.