నేడు ఏపీ సెట్
ABN , First Publish Date - 2021-10-31T06:54:21+05:30 IST
అధ్యాపకుల అర్హతకు నిర్వహించే ఏపీ సెట్-2021 ఆదివారం తిరుపతి కేంద్రంగా జరగనుంది.
తిరుపతిలో ఆరు పరీక్ష కేంద్రాలు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 30: అధ్యాపకుల అర్హతకు నిర్వహించే ఏపీ సెట్-2021 ఆదివారం తిరుపతి కేంద్రంగా జరగనుంది. ఇందుకోసం నగరంలోని ఎస్వీయూ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3,750 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.