6316 మందికి వేరుశనగ విత్తనాల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-31T04:50:04+05:30 IST
జిల్లాలోని భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా ఆదివారం 6316 మంది రైతులకు 2794 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.
చిత్తూరు(సెంట్రల్), మే 30: జిల్లాలోని భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా ఆదివారం 6316 మంది రైతులకు 2794 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 1,13,026 మంది రైతులకు 59.267 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ జరిగింది.