హరికృష్ణారెడ్డికి రైతు నేస్తం అవార్డు
ABN , First Publish Date - 2021-11-01T04:25:47+05:30 IST
ప్రకృతి వ్యవసాయ రైతు హరికృష్ణారెడ్డికి రాష్ట్ర స్థాయి ఐవీ సుబ్బారావు స్మారక రైతునేస్తం అవార్డు లభించింది.
పెనుమూరు, అక్టోబరు 31: ప్రకృతి వ్యవసాయ రైతు హరికృష్ణారెడ్డికి రాష్ట్ర స్థాయి ఐవీ సుబ్బారావు స్మారక రైతునేస్తం అవార్డు లభించింది. విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్టు సమావేశ హాల్లో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు.