ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్గా నందెపు శ్రీనివాస్
ABN , First Publish Date - 2021-12-07T07:10:07+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్గా ప్రముఖ వ్యాపారి నందెపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
జిల్లా అధ్యక్షుడిగా బూర్లగడ్డ వెంకట సబ్బారాయుడు
రాజమహేంద్రవరం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్గా ప్రముఖ వ్యాపారి నందెపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ఎన్నికయ్యారు. విజయవాడలో సోమవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం వీరిని ఎన్నుకున్నారు. శ్రీనివాస్, సుబ్బారాయుడులను నగరానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అభినందించారు.