జీఎస్టీ పెంపును ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2021-12-19T07:12:12+05:30 IST
కేంద్ర ప్రభుత్వం వసా్త్రలపై విధించిన అదనపు జీఎస్టీ (5 శాతం నుంచి 12 శాతానికి) పెంపునకు నిరసనగా కాకినాడలో శనివారం పెద్దఎత్తున ప్రదర్శన జరిగింది.
జీఎస్టీ పెంపునకు నిరసనగా కాకినాడ వస్త్ర వ్యాపారుల నిరసన
భానుగుడి (కాకినాడ), డిసెంబరు 18 : కేంద్ర ప్రభుత్వం వసా్త్రలపై విధించిన అదనపు జీఎస్టీ (5 శాతం నుంచి 12 శాతానికి) పెంపునకు నిరసనగా కాకినాడలో శనివారం పెద్దఎత్తున ప్రదర్శన జరిగింది. ది కాకినాడ క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు పాల్గొని పన్నుల పెంపుపై ఆందోళన వ్యక్తంచేశారు. పెంచిన జీఎస్టీ పన్నుల వల్ల అటు ప్రజలు, ఇటు వ్యాపారులపై పెనుభారం పడుతుందని, తక్షణం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యాపారులు డిమాండు చేశారు.