‘మహిళలపై గౌరవం లేని ప్రభుత్వం’
ABN , First Publish Date - 2021-12-08T06:14:53+05:30 IST
మహిళలపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నామాన రాంబాబు, టీడీపీ మాజీ సభ్యుడు డొక్కా నాథ్బాబులు అన్నారు.
మామిడికుదురు, డిసెంబరు 7: మహిళలపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నామాన రాంబాబు, టీడీపీ మాజీ సభ్యుడు డొక్కా నాథ్బాబులు అన్నారు. లూటుకుర్రులో గౌరవ సభ-ప్రజా సమస్యలపై చర్చావేదిక కార్యక్రమం బోనం బాబు నివాసం వద్ద మంగళవా రం జరిగింది. రాష్ట్రంలో దుష్టపాలన సాగుతుందని విమర్శించారు. మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్, సూదా బాబ్జి, చుట్టుగుళ్ల కిషోర్, మద్దాల పెద్దకాపు, వర్ధినేని బాబ్జి, తోట దలీలా, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.