మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-03T05:22:27+05:30 IST
చింతూరు మండలం కుయుగూరులో ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
చింతూరు, మే 2: చింతూరు మండలం కుయుగూరులో ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సురేష్బాబు కథనం మేరకు.. ఇంటి పనులను సకాలంలో పూర్తి చేయడంలేదన్న కారణంతో గ్రామానికి చెందిన తెల్లం రమ్య (23)ను తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రమ్య ఆదివారం ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.