Gunturలో వరుస దారి దోపిడీలు
ABN , First Publish Date - 2021-12-08T14:59:40+05:30 IST
జిల్లాలోని యడ్లపాడు మండలంలో వరుస దారి దోపిడీలు కలకలం రేపుతున్నాయి.
గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు మండలంలో వరుస దారి దోపిడీలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం రాత్రి సొలస గ్రామ సమీపంలో రెండు దోపిడీలు జరిగాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై దుండగులు దాడి చేసి డబ్బులు లాక్కెళ్లారు. సోమవారం రాత్రి బోయపాలెం వద్ద రెండు దారి దోపిడీలు జరిగాయి. వరుసగా జరుగుతున్న దోపిడీలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.