గుంటూరులో ఎమ్మెల్యే అన్నాబత్తుని వినూత్న కార్యక్రమం
ABN , First Publish Date - 2021-05-02T19:59:13+05:30 IST
తెనాలిలో కరోనా రోగులకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గుంటూరు: తెనాలిలో కరోనా రోగులకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెనాలి ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను ఎమ్మెల్యే తెలుసుకుంటున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలంటూ కరోనా రోగులకు ఎమ్మెల్యే ధైర్యం చెబుతున్నారు.