జైలులో బంధించటానికి వారు నేరస్థులు కాదు: ధూళిపాళ్ల కుమార్తె
ABN , First Publish Date - 2021-05-04T19:34:15+05:30 IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితి తమకు తెలియజేయాలని ఆయన కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితి తమకు తెలియజేయాలని ఆయన కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి డిమాండ్ చేశారు. సంగం డెయిరీ ఎండీ గోపాల కృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇద్దరి ఆరోగ్య వివరాలను తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. సంగం డెయిరీ ఎండీ, ఛైర్మన్లను కోవిడ్ కేసులతో నిండిన జైలులో బంధించటానికి వారు నేరస్థులు కాదని అన్నారు. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు గడిచాయని... వారికి మానసిక విముక్తి కల్పించి ఆరోగ్యవంతంగా బయటకు పంపేందుకు ఇంకెన్నిరోజులు కావాలని ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైదీప్తి పేర్కొన్నారు.