ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-03T05:06:25+05:30 IST
పెదకూరపాడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న సంజీవరెడ్డి(53) మంగళవారం పాతగుంటూరులోని రాఘవనగర్లోని తన నివాసం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు.
గుంటూరు(కార్పొరేషన్), నవంబరు 2: పెదకూరపాడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న సంజీవరెడ్డి(53) మంగళవారం పాతగుంటూరులోని రాఘవనగర్లోని తన నివాసం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానకు ఉరివేసుకున్నాడు. చిన్న కుమార్తె గమనించి పోలీసులకు సమాచారం అందించింది.
మృతదేహాన్ని జీజీహెచకి తరలించారు. కాగా ఆయన భార్య కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.