క్రిస్మస్ కానుకలు పంపిణీ
ABN , First Publish Date - 2021-12-26T05:10:41+05:30 IST
పట్టణంలోని వాజ్పేయి నగర్లో ఉన్న నిజస్వరూపిణి మందిర ఆవరణలో కువైట్కు చెందిన జై యాదవ సేవా సమితి ప్రతినిధులు శనివారం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు.
ప్రొద్దుటూరు రూరల్, డిసెంబరు 25: పట్టణంలోని వాజ్పేయి నగర్లో ఉన్న నిజస్వరూపిణి మందిర ఆవరణలో కువైట్కు చెందిన జై యాదవ సేవా సమితి ప్రతినిధులు శనివారం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ భారతీయులంతా ఒక్కటేనని, కులమతాలన్నీ ఒక్కటేనని పేర్కొన్నారు. జైయాదవ్ సేవా సమితి రిబ్కాసహాయంతో క్రైస్తవులందరికి భోజనాలు ఏర్పాటు చేయడంతోపాటు చీరలు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జైయాదవ్ సేవా సమితి ప్రతినిధి చిన్నకొండయ్య, వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మిదేవి, శూలం శివప్రసాద్యాదవ్, శ్రీజ్ఞానసరస్వతీ దేవి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు యనమల శ్రీనివా్సయాదవ్, చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులుకదిరి సంజీవరాయుడుయాదవ్, ధర్మ, పశువుల సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.