అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచండి : డీఎస్పీ
ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST
నగరంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, జూదం, బెట్టింగ్, వ్యభిచారం లాంటి వాటిపై నిఘా ఉంచాలని డీఎస్పీ సునీల్ సిబ్బందికి సూచించారు.
కడప(క్రైం), జూన్ 21: నగరంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, జూదం, బెట్టింగ్, వ్యభిచారం లాంటి వాటిపై నిఘా ఉంచాలని డీఎస్పీ సునీల్ సిబ్బందికి సూచించారు. సోమవారం నుంచి ప్రభుత్వం కర్ఫ్యూలో సడలింపు ఇచ్చిందని, ఆ లోపే షాపులు తెరచి ఉండాలని, మిగతా సమయంలో షాపులు తెరవకుండా చూసుకోవాలన్నారు. అలాగే అనవసరంగా బయట తిరిగే వ్యక్తుల వాహనాలకు జరిమానాలు వేయాలని సూచించారు. ఏదైనా గొడవలు కానీ, జనాల సమీకరించుకున్నా తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.