కరోనా కేసులు 15
ABN , First Publish Date - 2021-12-30T06:47:15+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 15 మంది కరోనా బారినపడ్డారు.
విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 15 మంది కరోనా బారినపడ్డారు. వీటితో మొత్తం పాజిటివ్ కేసులు 1,20,697కు చేరాయి. మరణాలు 1,479 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,19,085 మంది కోలుకున్నారు. 133 మంది చికిత్స పొందుతున్నారు.