రైస్మిల్లులో తనిఖీలు
ABN , First Publish Date - 2021-08-27T05:50:44+05:30 IST
రైస్మిల్లులో తనిఖీలు
చిన ఓగిరాల(ఉయ్యూరు), ఆగస్టు 26: చిన ఓగిరాలలో శ్రీశ్రీనివాస ఎంటర్ ప్రైజెస్కు చెందిన రైసుమిల్లులో ధాన్యం నిల్వలను జాయింట్ కలెక్టర్ మాధవీలత గురువారం తనిఖీ చేశారు. మిల్లు, గోదాములలో ధాన్యం, బియ్యం నిల్వలను రికార్డులతో పోల్చి చూశారు. తహసీల్దార్ కె.నాగేశ్వరరావు, సివిల్ సప్లైస్ డీటీ శివనాగరాజు, మండల వ్యవసాయ అధికారి జీవీ శివప్రసాద్ తనిఖీలో పాల్గొన్నారు.