భాస్కర రామారావు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-05-02T14:01:26+05:30 IST
కరోనాతో మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు బొడ్డు భాస్కర రామారావు మృతి బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: కరోనాతో మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు బొడ్డు భాస్కర రామారావు మృతి బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, జడ్పీ చైర్మన్ గా ప్రజలకు విశేషమైన సేవలందించారని గుర్తుచేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలుపుతూ... భాస్కరరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.