కల్లు గీత కార్మికుల సంక్షేమానికి చేయూత

ABN , First Publish Date - 2021-05-25T04:52:25+05:30 IST

కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కల్లుగీత పారిశ్రామికుల సంఘం, గౌడ సేవాసమితి సంఘం చేయూతనిస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల రంగయ్య, గౌడ్‌ యువత జిల్లా అధ్యక్షుడు జడపల్లి దయాకర్‌గౌడ్‌ తెలిపారు.

కల్లు గీత కార్మికుల సంక్షేమానికి చేయూత
గాయపడిన కల్లుగీత కార్మికుడికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న గౌడ సంఘం నాయకులు

విడవలూరు, మే 24: కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కల్లుగీత పారిశ్రామికుల సంఘం, గౌడ సేవాసమితి సంఘం చేయూతనిస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల రంగయ్య, గౌడ్‌ యువత జిల్లా అధ్యక్షుడు జడపల్లి దయాకర్‌గౌడ్‌ తెలిపారు. మండల పరిధిలోని విడవలూరు, ఊటుకూరు కంచరపాళెం, గాదెలదిన్నె గ్రామాల్లో ఇటీవల కల్లు గీస్తూ చెట్టుపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడిన కల్లుగీత కార్మికులు యేనేటి అజయ్‌ కుమార్‌, కుర్రా వెంకయ్య, వెంకటేశ్వర్లును సోమవారం గౌడ సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత పారిశ్రామికుల సంఘం, గౌడ సేవాసమితి వ్యవస్థాపకులు కోసూరు గోవిందయ్య ఆధ్వర్యంలో కల్లుగీస్తూ గాయపడిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ఆర్థికసాయం అందజేశామన్నారు. అదేవిధంగా కల్లుగీత కార్మికులు మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ.20వేలు ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. గతంలో గీత కార్మికులకు ప్రమాదాలు జరిగితే ఇస్తున్న పరిహారాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని, దానిని వెంటనే అమలుచేయాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మోర్ల వెంకటేశ్వర్లు గౌడ్‌, నిమ్మల మల్లికార్జున్‌గౌడ్‌, ఆలపాక రవిగౌడ్‌, పోసిన కిష్టమ్మ, నక్కా శ్రీనివాసులుగౌడ్‌, నక్కా శ్రీహరిగౌడ్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-25T04:52:25+05:30 IST