పరీక్షలు వాయిదా వేసేలా బుద్ధి ప్రసాదించాలని వినతి
ABN , First Publish Date - 2021-05-03T03:19:31+05:30 IST
పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసేలా సీఎం జగన్మోహన్రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని ఆదివారం స్థానిక అంబేద్కర్నగర్ సమీపంలోని వైఎస్రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ఏ
గూడూరురూరల్, మే 2: పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసేలా సీఎం జగన్మోహన్రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని ఆదివారం స్థానిక అంబేద్కర్నగర్ సమీపంలోని వైఎస్రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో నాయకులు వితనతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు మనోజ్కుమార్ మాట్లాడుతూ కరోనా ప్రభావం తీవ్రం కావడంతో మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమడకుండా పరీక్షలను వాయిదా వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చిన్నా, కార్తీక్, ఉపేంద్ర, నిఖిల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.