జీతాలు ఇవ్వకుంటే 16 నుంచి సమ్మె
ABN , First Publish Date - 2021-07-13T05:19:17+05:30 IST
నగర పంచాయతీ కార్మికులు పెండింగ్ జీతాల కోసం ఈనెల 16వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు.
పొదిలి, జూలై 12 : నగర పంచాయతీ కార్మికులు పెండింగ్ జీతాల కోసం ఈనెల 16వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శలు జి.నాగులు, డి.సుబ్బ య్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆరు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 16 నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై పలుమార్లు నగర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో వారు డిమాండ్ చేశారు.