కారు డ్రైవర్ల నిరసన
ABN , First Publish Date - 2021-12-29T04:47:38+05:30 IST
కారు పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించాలని కారు డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
పార్కింగ్ స్థలం మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి
ఎర్రగొండపాలెం, డిసెంబరు 28 : కారు పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించాలని కారు డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కారు డ్రైవర్ల యూ నియన్ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి తహ సీలార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ నిరసన కార్య క్రమం చేపట్టారు. అనంతరం వారు తహసీల్దార్ వీరయ్యకు వినతిపత్రం అందజేశారు. 30 సంవత్సరాలుగా కారు డ్రైవింగ్తో కుటుంబాలను పోషిం చుకుంటున్నామని తెలిపారు. పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని వారు తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ ఎక్కడో ఒక చోట ఖాళీ స్థలం చూసి కేటాయిస్తామని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో డ్రైవర్లు అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ రఫీ, కార్యదర్శి గుంటి వెంకటేష్, ఉపాధ్యక్షుడు డి.శేషయ్యగౌడ్, కోశాధికారి ఎ.రవి, ప లువురు డ్రైవర్లు పాల్గొన్నారు.