మరో 112 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-07-12T05:53:56+05:30 IST
జిల్లాలో కొత్తగా మరో 112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరో 112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,50,526కు చేరింది. వీరిలో 171 మంది ఆదివారం వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీటితో జిల్లాలో మొత్తం రికవరీల సంఖ్య 1,47,502కు చేరింది. మరో 1,988 మంది ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందడంతో జిల్లాలో కొవిడ్ మరణాలు 1,036కు చేరాయి.