కొత్తగా 14 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-19T06:00:12+05:30 IST
జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్ సోకినట్టు శనివారం నిర్ధారణ అయ్యింది.
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్ సోకినట్టు శనివారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,59,242కు చేరింది. ఇందులో 1,57,975 మంది కోలుకోగా, మరో 160 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం కొవిడ్తో మరొకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 1,107కు చేరింది.