అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి
ABN , First Publish Date - 2021-05-19T04:51:55+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
బెలగాం : అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బెలగాం రైతుబజార్ కూడలిలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు మాట్లాడుతూ... ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేలా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం బ్రాంచి అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, వై.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.