సురక్షితంగా వ్యాపారాలు చేయండి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-05-02T05:48:32+05:30 IST
కరోనా నేపథ్యంలో వ్యాపారు లంతా సురక్షితంగా వ్యాపారాలు చేసుకో వాలని ఎస్పీ నారా యణ నాయక్ పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, మే 1: కరోనా నేపథ్యంలో వ్యాపారు లంతా సురక్షితంగా వ్యాపారాలు చేసుకో వాలని ఎస్పీ నారా యణ నాయక్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమా వేశంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా వ్యాపార సంస్థలు మధ్యాహ్నం 3 గంటలలోపు ముగించాలన్నారు. రెండు గంటల వరకే సమయం ఉన్నా గంట సమయం సర్థుకునేందుకు అవకాశం కల్పిస్తారన్నారు. డీఎస్పీ శ్రీనాథ్, కమిషనర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.