వ్యాక్సినేషన్ ముమ్మరం
ABN , First Publish Date - 2021-05-30T05:48:39+05:30 IST
నగరంతో పాటు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఏలూరు అర్బన్ హెల్త్ సెంటర్లలో రెండు వేల మందికి శనివారం వ్యాక్సినేషన్ వేశామని నగర కమిషనర్ డి. చంద్రశేఖర్ తెలిపారు.
ఏలూరు టూటౌన్, మే 29 : నగరంతో పాటు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఏలూరు అర్బన్ హెల్త్ సెంటర్లలో రెండు వేల మందికి శనివారం వ్యాక్సినేషన్ వేశామని నగర కమిషనర్ డి. చంద్రశేఖర్ తెలిపారు. వ్యాక్సిన్ వేస్తున్న సెంటర్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. వ్యాక్సిన్ను నిబంధనలు పాటిస్తూ ప్రతి సెంటర్ వద్ద కార్యక్రమం చేపట్టామన్నారు. సీనియర్ సిటిజన్లకు ఇబ్బంది లేకుండా భౌతిక దూరం పాటిస్తూ వారికి కుర్చీలు వేశామన్నారు.