గ్రూప్ అడ్మిన్లపై కేసులు పెట్టండి: కేరళ డీజీపీ
ABN , First Publish Date - 2021-12-25T09:19:33+05:30 IST
కేరళలో ఇటీవల వరుస రాజకీయ హత్యలు జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ పోలీసు యం త్రాంగాన్ని అప్రమత్తం చేశారు...
తిరువనంతపురం, డిసెంబరు 24: కేరళలో ఇటీవల వరుస రాజకీయ హత్యలు జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ పోలీసు యం త్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల ను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం ప్రారంభంలో బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్, ఎస్డీపీఐ నేత కేఎస్ షాన్ హత్యల తర్వాత సోషల్ మీడియాలో కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సందేశాలు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి అంశాలపై చర్చలు నిర్వహించే గ్రూపు అడ్మిన్లపై కేసులు పెట్టాలని సూచించారు.