వాలంటైన్స్ డే నాడు తల్లిదండ్రుల పూజలు : శ్రీరామ్ సేన
ABN , First Publish Date - 2021-02-14T00:58:04+05:30 IST
వాలంటైన్స్ డే నాడు తల్లిదండ్రుల పూజలు నిర్వహించేందుకు
బెంగళూరు : వాలంటైన్స్ డే నాడు తల్లిదండ్రుల పూజలు నిర్వహించేందుకు శ్రీరామ్ సేన ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 14న కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలతను అడ్డుకోవాలని నిర్ణయించింది.
శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా వాలంటైన్స్ డే సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర, అశ్లీలమైన కార్యక్రమాలు జరగకుండా నిరోధిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం తాము ఫిబ్రవరి 14న తల్లిదండ్రుల పూజలు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 60 చోట్ల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. పబ్లు, బార్లు, షాపింగ్ మాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటి చోట్ల అశ్లీల కార్యకలాపాలు జరగకుండా తమ కార్యకర్తలు చర్యలు తీసుకుంటారన్నారు. ఇటువంటి కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులతో సామరస్యంగా తమ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు.